Advertisement

  • ధోని ఉండటంతో మేము ఎంత రాణించిన జట్టులో చోటు దక్కకపోయేది ...పార్థివ్ పటేల్

ధోని ఉండటంతో మేము ఎంత రాణించిన జట్టులో చోటు దక్కకపోయేది ...పార్థివ్ పటేల్

By: Sankar Sat, 06 June 2020 11:57 AM

ధోని ఉండటంతో మేము ఎంత రాణించిన జట్టులో చోటు దక్కకపోయేది ...పార్థివ్ పటేల్


ధోని ..భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ్గ పేరు ..తన అసమాన నైపుణ్యంతో భారత జట్టుకు ఎన్నో ట్రోఫీలను సాధించాడు..తొలుత కీపర్ గా టీంలోకి వచ్చిన ధోని భారత జట్టుకు విజయవంతం అయిన కెప్టెన్ గా నిలిచాడు ..దీనితో కీపర్ గా ధోని ఉన్నంత కాలం మారె ఆటగాడికి అవకాశం దక్కలేదు.. పార్థీవ్ పటేల్‌తో పాటు దినేశ్ కార్తీక్ అప్పుడప్పుడు టీమ్‌లోకి ఎంపికైనా.. అది సెకండ్ వికెట్ కీపర్‌‌గా మాత్రమే. 2014లో టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినా.. అప్పటికే రేసులో పార్థీవ్, కార్తీక్ చాలా వెనకబడిపోయారు. దాంతో.. సాహాకి అవకాశం దక్కింది. ఇప్పుడు అతనికి పోటీగా రిషబ్ పంత్ ఉన్నాడు.

ms dhoni,parthiv patel,wicket keepar,india,cricket ,ధోని , .పార్థివ్ పటేల్ ,  కెప్టెన్ , కార్తీక్ ,  సాహా, పంత్

ధోనీతో అప్పట్లో పోటీపై పార్థీవ్ పటేల్ తాజాగా మాట్లాడుతూ ‘‘టీమిండియా అప్పటి పరిస్థితుల్ని ఒప్పుకోవాలి.. ఇంకా చెప్పాలంటే అంగీకరించాల్సిన వచ్చింది. ధోనీ కెప్టెన్‌గా ఉండటంతో.. మిగిలిన వికెట్ కీపర్లందరూ సెకండ్ వికెట్ కీపర్ స్థానానికి మాత్రమే పోటీపడాల్సి వచ్చింది. అప్పట్లో నాపై వేటు పడగానే.. దేశవాళీలో ఆడుతూ ఆటతీరుని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాను’’ అని వెల్లడించాడు.

భారత్ జట్టులోకి 2002లో అరంగేట్రం చేసిన పార్థీవ్ పటేల్ ఇప్పటి వరకూ 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లాడాడు. ఆఖరిగా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆడిన పార్థీవ్ పటేల్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 2, 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో.. అతనిపై వేటు పడగా.. తర్వాత అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు.


Tags :
|

Advertisement