Advertisement

ఎస్ఈసీ-ప్రభుత్వం మధ్య వార్...

By: chandrasekar Thu, 19 Nov 2020 6:08 PM

ఎస్ఈసీ-ప్రభుత్వం మధ్య వార్...


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో వేడి పెరుగుతోంది. ఎస్ఈసీ-ప్రభుత్వం మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లు, జడ్పీసీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దైంది. వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో సమావేశం రద్దు చేసినట్లు సమాచారం.

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎస్ నీలం సాహ్నీకి ఎస్‌ఈసీ రెండోసారి లేఖ రాసినా స్పందన లేదు. సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు అంటున్నారు.

ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఎస్ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం నుంచి సహకారం లేదంటున్న ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్థానిక ఎన్నికల పిటిషన్లు విచారణకు వచ్చినపుడు ఈ అంశాన్ని ప్రస్తావించాలని భావిస్తున్నారట.

Tags :
|
|
|

Advertisement