Advertisement

  • ఎక్కువగా మందు తాగే మహిళలున్న రాష్ట్రం తెలుసుకోవాలా...

ఎక్కువగా మందు తాగే మహిళలున్న రాష్ట్రం తెలుసుకోవాలా...

By: chandrasekar Thu, 29 Oct 2020 09:26 AM

ఎక్కువగా మందు తాగే మహిళలున్న రాష్ట్రం తెలుసుకోవాలా...


అన్ని పోటీలకు మేము సిద్ధం అన్నట్లు మహిళలు మందు పోటీలో కూడా ముందున్నారు. పురుషులతో తామేం తక్కువ కాదంటూ మహిళలు పలు రంగాల్లో రాణిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు వారు తమ అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. మద్యం సేవించడంలోనూ పురుషులకు పోటీగా నిలుస్తున్నారు. అసోం రాష్ట్ర మహిళలు మరో అడుగు ముందుకేసి దేశంలో అందరి కంటే టాప్‌లో ఉన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడైంది. మందు తాగడంలో అసోం రాష్ట్ర మహిళలు అందరి కంటే ముందున్నారు. అందులోనూ 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ 2019-20 లెక్కల ప్రకారం ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న అసోం మహిళల్లో 26.3 శాతం మంది మద్యం తాగుతున్నారు. మేఘాలయలో ఇది 8.7 శాతంగా ఉంది. కానీ దేశంలో మద్యం సేవిస్తున్న మహిళలు 1.2 శాతం మాత్రమే ఉన్నారు.

మద్యం సేవించే వివరాల కోసం 2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం ఈ గణాంకాలను వెల్లడించారు. 2018-19లో మరోసారి సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వే నివేదిక ఇంకా విడుదల కావాల్సి ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 3 ప్రకారం అసోంలో మద్యం సేవించే మహిళల శాతం 7.5 శాతం ఉండగా సర్వే 4లో ఇది 26.3 శాతానికి పెరిగింది. పొగాకు ఉత్పత్తుల వాడకంలోనూ అసోం పురుషులు, మహిళలే టాప్‌లో ఉన్నారు. అందులోనూ పురుషులతో పోలిస్తే మహిళలు చాలా ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారు. దేశవ్యాప్త గణాంకాలతో పోల్చితే అసోంలో 60 శాతం మహిళలు, 17.7 శాతం పురుషులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా 35 శాతం మంది మహిళలు వారానికి ఒకసారి మద్యం సేవిస్తున్నారు. అసోంలో 44.8 శాతం మంది మహిళలు వారంలో ఒకసారి మందు కొడుతున్నారు. 59 శాతంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో మహిళలు టాప్‌లో ఉన్నారు. మరి వీరికి దీటుగా ఇంకా ఏ రాష్ట్రాలు పోటీకివస్తాయో చూస్తాం.

Tags :
|

Advertisement