Advertisement

ఓటు వేయడం మన కనీస బాధ్యత: హీరో రాజశేఖర్

By: chandrasekar Wed, 02 Dec 2020 09:53 AM

ఓటు వేయడం మన కనీస బాధ్యత: హీరో రాజశేఖర్


నిన్న మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదు చేయబడింది. రాష్ట్రప్రభుత్వం, అధికారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా చాలా మంది ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో పల్లెటూర్ల వారి కంటే, నిరక్షరాస్యుల కంటే అథములమని నిరూపించుకున్నారు. 2010, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే తక్కువగా అంటే 40 శాతానికి తక్కువగా పోలింగ్ నమోదైంది. ఇంత చెత్త రికార్డులోనూ కొంత మంది తమ స్ఫూర్తిని చాటారు. నడవలేని స్థితిలో ఉన్న వాళ్లు, దివ్యాంగులు, వృద్ధులు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. ఓ యువకుడు ఓటు వేయడం కోసం ఏకంగా విదేశాల నుంచి తరలివచ్చాడు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే స్ఫూర్తి చాటారు. కరోనా బారినపడి కొద్ది రోజుల కిందటే కోలుకున్న సినీ నటుడు రాజశేఖర్ కూడా ఇదే కోవలోకి వస్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హీరో రాజశేఖర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణి జీవితతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నిజానికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నారు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మూడు రోజుల కిందటి వరకు కూడా అయన ఆక్సీజన్ సపోర్టు తీసుకున్నారు. ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టడం లేదు. అయినప్పటికీ ఎన్నికల్లో విధిగా ఓటు వేయాలని అతృతతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోక పోయిన ఓటు వేయడం తమ బాధ్యతని గుర్తుచేశారు. ఓటు వేసిన అనంతరం హీరో రాజశేఖర్ మీడియాతో సంభాషించారు. అందరూ ఓటు హక్కు వినిగించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నాకు కరోనా వచ్చిన తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడుతున్నా. మీ అందరి ప్రేమ, ప్రార్థనలే నా ప్రాణాలను కాపాడాయి. రెండు, మూడు రోజులుగానే ఆక్సీజన్ సపోర్టు లేకుండా ఇంట్లో తిరుగుతున్నాను. ఇవాళ కచ్చితంగా ఓటింగ్ చేయాలని జీవితకు చెప్పి ఇక్కడికి వచ్చాను. ఓటు వేయడం మన కనీస బాధ్యత. ఇది మన భవిష్యత్తు అని రాజశేఖర్ చెప్పారు. మనం సరైన వాళ్లను ఎన్నుకుంటేనే పాలన బావుంటుందని రాజశేఖర్ చెప్పారు. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లు వివరించారు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను.. లంగ్స్ చాలా ఎఫెక్ట్ అయింది. ఇక నార్మల్ అవడానికి ఒకట్రెండు నెలలు పడుతుంది. అందరికీ థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు జీవిత మాట్లాడుతూ మనకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు అని చెప్పారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ చాలా తక్కువగా ఉందని విన్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ పెద్దగా ఓటర్లు లేరు. రాజకీయాల గురించి అందరం మాట్లాడుకుంటాం.

అలాగే ప్రజలకు ఏది మంచి, ఏది చెడు ఏది బాగుంది, ఏది బాగాలేదో చర్చించుకుంటాం. కానీ, ఓటింగ్ విషయానికి వచ్చే సరికి ఎందుకిలా జరుగుతుంది? ఎంతగా ప్రచారం చేసినా ఓటింగ్‌కు ఎందుకు ఆసక్తి చూపట్లేదు? అందరూ ఆలోచించాలి అని జీవిత అన్నారు. ఓటింగ్ ఎందుకు అని అవాయిడ్ చేస్తే మన జీవితాలు ఇంకా అంధకారమైపోతాయి. ఈ చీకట్లను తరిమికొట్టడానికి మనకున్న ఏకైక ఆయుధం ఓటు. అందువల్ల అందరూ ఓటు వేయాలి. రాజశేఖర్ గారు బయటకి వచ్చే పరిస్థితి లేదు. కానీ, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడకు వచ్చారు. ఇవాళ రెండు నిమిషాలైనా కేటాయించి ఓటు వేస్తానని చెప్పారు. అందువల్ల ఓటు వేయడానికి వచ్చారు. అర్హత ఉన్నవాళ్లకు, పనిచేసే వాళ్లకే ఓటు వేయాలి అని జీవిత అన్నారు. కరోనా కారణంగా రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. కరోనాతో పోరాటం చేయటంలో నాన్న ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయండి అంటూ ఆయన కుమార్తె శివాత్మిక ట్వీట్ చేయడం మరింత కలవరానికి గురి చేసింది. అయితే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆయన ఆ తర్వాత కోలుకున్నారు. అయన ఇంకా కొంతకాలం విశ్రాంతి తీసుకుంటేనే పూర్తిగా కోలుకుని మామూలు స్థితికి చేరుకుంటారు.

Tags :
|
|

Advertisement