Advertisement

  • ఓటర్లు లేక పోలింగ్ కేంద్రంలో నిద్రపోతున్న సిబ్బంది.. ఫొటో వైరల్...

ఓటర్లు లేక పోలింగ్ కేంద్రంలో నిద్రపోతున్న సిబ్బంది.. ఫొటో వైరల్...

By: chandrasekar Tue, 01 Dec 2020 8:19 PM

ఓటర్లు లేక పోలింగ్ కేంద్రంలో నిద్రపోతున్న సిబ్బంది.. ఫొటో వైరల్...


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ ఎలా ఉందో ఈ ఒక్క ఫొటో చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటర్లు రాక ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది ఈగలు, దోమలు తోలుకుంటున్నారు.

చివరకు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత అలా ఓ కునుకు తీశారు. ఓటింగ్‌కు సంబంధించిన సరంజామా అంతా టేబుల్ మీద పెట్టి అలాగే కునుకు తీస్తున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, వారు ఉద్యోగులా? లేకపోతే అభ్యర్థుల తరఫు ఏజెంట్లా అనేది కూడా తెలియాల్సి ఉంది. వాస్తవంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లడం నిషేధం.

పోలింగ్ సిబ్బందితో పాటు పార్టీల తరఫున వచ్చే పోలింగ్ ఏజెంట్లకు కూడా ఇది అమలవుతుంది. అయితే, మరి ఈ ఫొటోను ఎవరు తీశారో తెలియదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :
|
|

Advertisement