Advertisement

  • అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌కు...అరాచకం కావాలంటే బీజేపీకి ఓటు వేయండి: కేటీఆర్

అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌కు...అరాచకం కావాలంటే బీజేపీకి ఓటు వేయండి: కేటీఆర్

By: chandrasekar Thu, 19 Nov 2020 5:56 PM

అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌కు...అరాచకం కావాలంటే బీజేపీకి ఓటు వేయండి: కేటీఆర్


హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని.. అరాచకం కావాలంటే బీజేపీకి ఓటువేయాలని నగవాసులకు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని.. పలు అంశాలపై మాట్లాడారు. ఆరున్నరేళ్లుగా నగరం ఎంతో ప్రశాంతంగా ఉండి అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్ప‌డితే రాష్ట్రం అంధకారం అయిపోతుందని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలుతుందని ఎన్నో అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. కానీ మన రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయని, ట్రాఫిక్, తాగునీటి కష్టాలను తీర్చామని తెలిపారు. గతంలో 14 రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. 1916లో ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయాత్ సాగ‌ర్, 1920 గండిపేట జలాశయాలను కట్టారన్న ఆయన.. ఆ తర్వాత ఎవరూ తాగునీటిపై దృష్టిపెట్టలేదని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2020లో కేశావ‌పురం రిజ‌ర్వాయ‌ర్ క‌డుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Advertisement