Advertisement

  • మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ కానిస్టేబుల్‌నే చితక్కొట్టిన వాలంటీర్లు

మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ కానిస్టేబుల్‌నే చితక్కొట్టిన వాలంటీర్లు

By: chandrasekar Fri, 02 Oct 2020 7:15 PM

మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ కానిస్టేబుల్‌నే చితక్కొట్టిన వాలంటీర్లు


దేశ రాజధాని ఢిల్లీలో మాస్క్ లేదని కానిస్టేబుల్‌నే చితక్కొట్టారు. డ్యూటీ ముగించుకొని తన బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్న కానిస్టేబుల్‌ నరేశ్‌ను కొంత మంది వాలంటీర్లు మార్గమధ్యంలో ఆపి మాస్క్ గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో కానిస్టేబుల్‌ను నడిరోడ్డుపైనే చితకబాదారు. కర్రలు తీసుకొని కొట్టారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాడి దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. అది కాస్త ట్విటర్‌లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది. కార్లలో వచ్చిన ఏడు నుంచి ఎనిమిది వ్యక్తులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో కానిస్టేబుల్ సివిల్ దుస్తుల్లో ఉన్నారు.

కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారందరూ స్వచ్ఛంద కార్యకర్తలని తెలుస్తోంది. ఆ బృందంలోని మహిళా వాలంటీర్‌ను కానిస్టేబుల్ నరేశ్ అసభ్యంగా దూషించడం వల్లే దాడి చేసినట్లు మరో వాదన. వాలంటీర్లు తనపై దాడికి దిగగానే కానిస్టేబుల్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారు. కానిస్టేబుల్ నరేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరుతరపు వాదనలు పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

Advertisement