Advertisement

  • ఇద్దరు సభ్యులు ఉన్న నిరుపేద కుటుంబానికి 58 లక్షల కరెంటు బిల్

ఇద్దరు సభ్యులు ఉన్న నిరుపేద కుటుంబానికి 58 లక్షల కరెంటు బిల్

By: Sankar Sat, 25 July 2020 4:38 PM

ఇద్దరు సభ్యులు ఉన్న నిరుపేద కుటుంబానికి 58 లక్షల కరెంటు బిల్



ఈ మధ్య పవర్ బిల్లు సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు కూడా షాక్ ఇస్తుంది. బంగ్లాలు, కార్లు లేని నిరు పేదలకు సైతం కరెంట్ బిల్లు లక్షల్లో వస్తోంది. తాజాగా ఓ నిరుపేద అంధుల కుటుంబానికి ఏకంగా రూ.58 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

పంచదయాన్‌ గ్రామానికి చెందిన ప్రసన్నానాయక్‌, అతని భార్య నివసిస్తున్నారు. ఇద్దరూ అంధులే. కళ్లు కనిపించవు. వీరి ఇంట్లో కేవలం నాలుగు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. అయితే వీరికి విద్యుత్ బిల్లు మాత్రం లక్షల్లో వచ్చింది.

గత ఏడు నెలలుగా వీరు విద్యుత్‌ బిల్లు చెల్లించలేదు. దీంతో ఒక్కసారిగా భారీ మొత్తంగా రూ.58 లక్షల విద్యుత్‌ బిల్లును వేసి పంపారు అధికారులు. దీనిని చూసిన ప్రసన్నానాయక్‌ కుటుంబం ఇంత డబ్బు తాము చెల్లించలేమన్నారు. గతంలోనూ ఇదేవిధంగా రూ.18వేల బిల్లు వస్తే అధికారులను కలిసి రూ.9,700 చెల్లించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత డబ్బు తాము చెల్లించలేమని.. ఇదివరకే విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశామని నాయక్‌ తెలిపారు. సమస్యపై అధికారులు స్పందించకుంటే వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు..

Tags :
|
|

Advertisement