ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు
By: chandrasekar Wed, 08 July 2020 12:01 PM
విశాఖ ఎల్జీ పాలిమర్స్
గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని బలిదీసుకున్న ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్కి
జియాంగ్, డైరెక్టర్
డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్రావు సహా మొత్తం 12
మందిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే
మీనా ఈ వివరాలను వెల్లడించినట్టుగా పీటీఐ పేర్కొంది.
మే 7న
జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోగా మరో 585 మంది అస్వస్థతకు గురై
ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ
దుర్ఘటన చోటుచేసుకుందని స్పష్టంచేస్తూ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది
నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది.
నీరబ్ కుమార్
నేతృత్వంలోని కమిటీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి 4వేల
పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో అనేక సంచలన విషయాలను కమిటీ
పొందుపర్చింది. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టైరిన్ ట్యాంకుల్లో
ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదం జరిగిందని నీరబ్ కుమార్ కమిటీ నిర్థారించింది.