యోగ డే రోజున సరికొత్త ఆసనాలు వేస్తున్న సెహ్వాగ్
By: Sankar Sun, 21 June 2020 7:21 PM
వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో తన విధ్వంసక బ్యాటింగుతో ప్రత్యర్థులకు చుక్కలు చేయించిన అరివీర భయంకర ఆటగాడు ..అయితే క్రికెట్ నుంచి రిటైర్ అయినా తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నాడు..క్రికెట్ ఆడేటప్పుడు సెహ్వాగ్కు ఎంత ఫాలోయింగ్ ఉందొ , ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది ..సెహ్వాగ్ మాదిరి సోషల్ మీడియాలో అభిమానులను అలరించే ఆటగాడు ఇంకొకరు లేరు ..తాజాగా యోగా డే సందర్భంగా అభిమానులను పలకరించాడు ఈ నజఫ్ఘర్ నవాబ్..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ టీమిండియా మాజీ ఆటగాడు వినూత్న ఆసనంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. వీరు చేసింది ఏంటో తెలియదు గాని అతన్ని పరిశీలిస్తే మాత్రం మొకాళ్ల కిందకు తన చేతులు పెట్టి కేవలం పాదాల సాయంతోనే హాల్ ఆవరణలో నడవడం ఆరంభించాడు. పాపం సెహ్వాగ్ ఇది చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఏమో కాని వెంటనే ఈ వీడియోనూ ట్విటర్లో షేర్ చేశాడు.
కచ్చితంగా ఇది యోగా అని చెప్పలేను కానీ దానికి కొంత సమయం పడుతుంది అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం సెహ్వాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'వీరు నువ్వు చేసిన ఆసనం పేరేంటో తెలియదు కానీ నువ్వు చాలా కష్టపడ్డావు'.. ' నీ కష్టానికి ఇవే మా జోహార్లు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.