Advertisement

  • ఆ ఆటగాడు అలంకరణ వస్తువుగా మారిపోయాడు ..వీరేంద్ర సెహ్వాగ్

ఆ ఆటగాడు అలంకరణ వస్తువుగా మారిపోయాడు ..వీరేంద్ర సెహ్వాగ్

By: Sankar Fri, 09 Oct 2020 12:01 PM

ఆ ఆటగాడు అలంకరణ వస్తువుగా మారిపోయాడు ..వీరేంద్ర సెహ్వాగ్


సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్‌ ముఖ్యంగా క్రీడా వార్తలపై తనదైన శైలిలో కామెంట్లతో అలరిస్తారు. తాజాగా ఆయన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆటగాళ్లపై విమర్శలు చేశారు.

కోల్‌కోతాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధోని సారథ్యంలో కొందరు బ్యాట్స్‌మెన్‌ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నంత తీరుబడిగా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా చెన్నై బ్యాట్స్‌మన్‌ పేలవ ప్రదర్శన ఆశ్చర్యానికి గురి చేసిందని తన ఫేస్‌బుక్‌ పేజీ ‘వీరు కి బైటక్‌’లో చెప్పుకొచ్చారు.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌ ఆటతీరు జట్టుకు ఏమాత్రం ప్రయోజనం కలిగించ లేదని అన్నారు. జాదవ్‌ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని పేర్కొన్నారు. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన జాదవ్‌కు మ్యాన్‌‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఇవ్వాల్సిందని చురకలు వేశాడు.

కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో వీరవిహారం చేసిన చెన్నై ఓపెనర్లు జట్టుకు సునాయాస విజయాన్ని అందించగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో తేలిపోయారు. మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ క్రీజులోకి దిగినా 157 పరుగులే చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ నిర్ణయాలు కూడా మరోసారి పరిశీలనకు వచ్చాయని కొందరు క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Tags :

Advertisement