ఆర్సీబితో మ్యాచ్ లో పాత ధోని కనిపించాడు..వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు
By: Sankar Mon, 26 Oct 2020 6:07 PM
వరుస ఓటముల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిన్న ఆర్సీబి తో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది..బ్యాటింగ్ , బౌలింగ్ రెండు విబాగాలలో అద్భుతంగా ఆడిన ధోని సేన మల్లి తన స్థాయి ఆటతీరుని ప్రదర్శించింది..దీనితో ఈ విజయంపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు..
ఇక్కడ ప్రత్యేకంగా సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని ప్రశంసించాడు. ధోని ఈజ్ బ్యాక్ అంటూ పేర్కొన్న సెహ్వాగ్.. ధోనిని ఫుల్ కెప్టెన్సీ మూడ్లో చూసిన మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు. పాత ధోనిని మరొకసారి చూశామని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఫీల్డ్లో పాదరసంలో వ్యూహాలు పన్నుతూ ఆర్సీబీని ఇరకాటంలోకి నెట్టాడన్నాడు.
ప్రధానంగా బౌలింగ్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ తన మార్కు కెప్టెన్సీతో ధోని ఆకట్టుకున్నాడని సెహ్వాగ్ కొనియాడాడు. ముఖ్యంగా సాంత్నర్ను తుది జట్టులోకి తీసుకోవడం ఒక మంచి నిర్ణయమన్నాడు. అదే సమయంలో దీపక్ చాహర్, సామ్ కరాన్ల బౌలింగ్లో డెత్ ఓవర్లలో వేయించడం ధోని కెప్టెన్సీ మూడ్లోకి రావడాన్ని చూపెట్టిందన్నాడు.