ఐపీయల్ 2020 డ్రీం లెవెన్ ను ప్రకటించిన సెహ్వాగ్ ...కెప్టెన్ గా ఎవరో తెలుసా!
By: Sankar Wed, 11 Nov 2020 7:05 PM
ఐపీఎల్ 2020 ముగిసిన నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన డ్రీమ్ జట్టును ప్రకటించాడు. ఈ సీజన్లో ఎనమిది జట్ల క్రికెటర్ల ఆటతీరు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసినట్టు సెహ్వాగ్ తెలిపాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ బ్యాట్స్మెన్ దేవ్దత్ పడిక్కల్ను ఓపెనర్లుగా ఎంపిక చేసుకున్నాడు. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశాడు. నాలుగో స్థానం కోసం విరాట్ కోహ్లీని (కెప్టెన్ గాను) ఎంచుకున్న సెహ్వాగ్.. ఐదో స్థానంలో డేవిడ్ వార్నర్ను, ఆరోస్థానంలో ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేశాడు.
ఇక పేస్ బౌలర్ల జాబితాలో కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు.. స్పిన్నర్ల కోటాలో యుజ్వేంద్ర చహల్, రషీద్ ఖాన్లకు వీరేంద్ర సెహ్వాగ్ తన తుది జట్టులో చోటిచ్చాడు...కాగా ఈ ఏడాది విన్నింగ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం..