ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్న విరాట్ కోహ్లీ
By: chandrasekar Fri, 18 Sept 2020 5:04 PM
భారత కెప్టెన్ విరాట్
కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్
ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్నాడు. కోహ్లీ 871
పాయింట్లతో తిరుగులేని స్థితిలో ఉండగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (855), బాబర్ అజామ్(829) వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
ఆస్ట్రేలియాతో వన్డే
సిరీస్లో విశేషంగా రాణించిన ఓపెనర్ బెయిర్ స్టో టాప్-10లో
చోటు దక్కించుకున్నాడు. ఆసీస్తో ఆఖరిదైన మూడో వన్డేలో బెయిర్స్టో 126
బంతుల్లో 112 పరుగులు చేసి రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. 30 ఏండ్ల
యార్క్షైర్ ఆటగాడు 2018 అక్టోబర్లో తొలిసారి తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
న్యూజిలాండ్ పేసర్
ట్రెంట్ బౌల్ట్ వన్డే బౌలర్ల జాబితాలో నంబర్వన్ స్థానంలో నిలువగా టీమిండియా
స్పీడ్స్టర్ బుమ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో
రవీంద్ర జడేజా ఎనిమిదో ర్యాంకులో ఉన్నాడు. అఫ్గనిస్థాన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 301
పాయింట్లతో అగ్రస్థాన౦లో ఉన్నాడు.