ఆర్సీబి గురించి భావోద్వేగ వీడియో పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ
By: Sankar Sun, 09 Aug 2020 4:31 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ త్వరలో యూఏఈ లో ప్రారంభం కానుంది ..దీనికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ..టీములు కూడా తమ ఆటగాళ్లను యూఏఈ తీసుకువెళ్లే పనిలో ఉన్నాయి ..అయితే తాజాగా విరాట్ కోహ్లీ తన ఐపీయల్ టీం అయినా ఆర్సీఐబి గురించి ఒక బావోద్వేగ వీడియో ను పోస్ట్ చేసారు ..
ఐపీయల్ ప్రారంభ సీజన్ నుంచి కూడా ఒకే జట్టుకు ఆడుతున్న అతి కొద్దీ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు ..ఇక ఈ వీడియోలో ఐపీఎల్ ప్రారంభం నుంచి తన క్లిప్స్, సహచరులతో అనుబంధాన్ని తెలిపేవి.. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్తో ఉన్న బంధం తెలిపేలా వీడియో రూపొందించాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహాన్ని కూడా ఈ వీడియోలో చూపించాడు కొహ్లీ.
ఐపీఎల్ ఇంతవరకూ గెలుచుకోని ఆర్సీబీకి అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆ జట్టు రాహుల్ద్రావిడ్, కెవిన్ పీటర్సన్ను వదులుకున్నా కొహ్లీని మాత్రం వదులుకోవడం లేదు. రెండు సీజన్ల తరువాత, కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. కాగా, ఇతర భారతీయ ఆటగాళ్ల మాదిరిగానే, కొహ్లీ మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. తిరిగి క్రికెట్ ఆడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. 31 ఏళ్ల ఈ క్రికెటర్ ఐపీఎల్ 2020 లోనూ ఆర్సీబీకి నాయకత్వం వహిస్తాడు.