ధోనిని మిస్ అవుతున్నా ..కెప్టెన్ విరాట్ కోహ్లీ
By: Sankar Tue, 08 Dec 2020 10:51 AM
మహేంద్ర సింగ్ ధోని ...టీంఇండియాలో సచిన్ తర్వాత దాదాపు అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ధోని , ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే ..అయితే అభిమానులు మాత్రం ఇంకా ధోనిని మిస్ అవుతూనే ఉన్నారు...తాజాగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న టి ట్వంటీ సిరీస్ లో వి మిస్ యూ ధోని అంటూ సందడి చేసారు...
ఇక ఆ ప్లకార్డు చుసిన కోహ్లీ 'మీరే కాదు.. నేను ధోనిని మిస్సవుతున్నా ' అంటూ వారికి సైగలు చేశాడు. కోహ్లి సైగలతో మరింత జోష్ నింపుకున్న అభిమానులు ధోని.. కోహ్లి.. నామస్మరణతో స్టేడియం మొత్తం హోరెత్తించారు. ధోని అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని కోహ్లి మరోసారి చెప్పకనే చెప్పాడు.
ఎంఎస్ ధోని సారథ్యంలో ఎంతో దూకుడుగా కనిపించిన కోహ్లి.. అతన్ని తన మెంటార్గా.. తన గురువుగా భావించేవాడు. అంతేకాదు కోహ్లి కెప్టెన్ అయిన తర్వాత కూడా ఆటలో భాగంగా విజయంపై, ఫీల్డింగ్ రీప్లేస్మెంట్పై ధోనితో సుధీర్ఘ చర్చలు జరిపేవాడు. అప్పట్లో వీరిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు టీమిండియాకు అనేక విజయాలను కట్టబెట్టాయి