అరుదయిన రికార్డు కు 23 పరుగుల దూరంలో కోహ్లీ
By: Sankar Wed, 02 Dec 2020 05:34 AM
ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డు లు తన కథలో వేసుకొని మోడరన్ డే గ్రేట్ ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరొక అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు...ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ ఇంకో 23 పరుగులు చేస్తే ప్రపంచ వన్ డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు ..
ఈ క్రమంలో కోహ్లి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్కు ఈ ఘనతను అందుకోవడానికి 309 మ్యాచ్ల్లో 300 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. కానీ కోహ్లి ఆ 23 పరుగులు చేస్తే 242వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.
ఇక మొత్తంగా చూసుకుంటే వన్డేల్లో 12 వేల పరుగులు చేసిన వారిలో కోహ్లి ఆరో ప్లేయర్గా నిలవనున్నాడు. ఇంతకు ముందు సచిన్తోపాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేల జయవర్దనె కూడా వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన జాబితాలో ఉన్నారు