Advertisement

  • మూడో టి ట్వంటీ లో టీమిండియా ఓటమిపై స్పందించిన కోహ్లీ

మూడో టి ట్వంటీ లో టీమిండియా ఓటమిపై స్పందించిన కోహ్లీ

By: Sankar Tue, 08 Dec 2020 8:35 PM

మూడో టి ట్వంటీ లో టీమిండియా ఓటమిపై స్పందించిన కోహ్లీ


ఆస్ట్రేలియాతో నేడు జరిగిన మూడో టి ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా పోరాడి ఓడిన విషయం తెలిసిందే...కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి వరకు పోరాడినప్పటికీ మిగతా బ్యాట్సమెన్ నుంచి సహకారం కరువు అవ్వడంతో టీమిండియా ఓడిపోయింది...

అయితే.. ఫైనల్ టీ20లో టీమిండియా ఓటమికి కారణాన్ని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. మిడిల్ ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ ఆశించినంతగా లేదని, ఓటమికి అదే ప్రధాన కారణమని కోహ్లీ తెలిపాడు. హార్థిక్ పాండ్యా ఆడుతుండగా.. ఒకానొక దశలో గెలుపు ఖాయమని తాము భావించామని, మిడిల్ ఓవర్లలో తాము సరైన బ్యాటింగ్ చేయకపోవడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు..

కాగా ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటె టీం ఇండియా సిరీస్ వైట్ వాష్ చేసి ఉండేది ..ఇంతకుముందు 2016 లో జరిగిన టి ట్వంటీ సిరీస్ లో ఒకసారి టీం ఇండియా వైట్ వాష్ చేసింది...ఇక ఈ సిరీస్ లో బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్య మాన్ అఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు ..

Tags :
|

Advertisement