మెన్స్ ప్లేయర్ అఫ్ ది డికేడ్ అవార్డు రేస్ లో కోహ్లీ , అశ్విన్ ...
By: Sankar Tue, 24 Nov 2020 7:50 PM
ఐసీసీ ప్రతిష్టాత్మక మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్కు నామినేట్ అయ్యాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఈ అవార్డు కోసం మొత్తం ఏడు మంది ప్లేయర్స్ రేసులో ఉన్నారు.
అందులో కోహ్లితోపాటు ఇండియన్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఉండటం విశేషం. ఈ ఇద్దరు కాకుండా జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు. కోహ్లి ఇదొక్కటే కాకుండా మొత్తం ఐదు అవార్డుల రేసులో ఉన్నాడు.
దశాబ్దపు అత్యుత్తమ వన్డే ప్లేయర్కు కూడా విరాట్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ధోనీ, రోహిత్ శర్మ, లసిత్ మలింగ, మిచెల్ స్టార్క్, డివిలియర్స్, సంగక్కర కూడా పోటీ పడుతున్నారు. ఇక దశాబ్దపు అత్యుత్తమ టీ20 ప్లేయర్ అవార్డు కోసం కూడా కోహ్లి, రోహిత్ నామినేట్ అయ్యారు. ఈ లిస్ట్లో రషీద్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫించ్, మలింగ, క్రిస్ గేల్ ఉన్నారు.