Advertisement

  • ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ముంగిట కోహ్లీని ఊరిస్తున్న రికార్డు

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ముంగిట కోహ్లీని ఊరిస్తున్న రికార్డు

By: Sankar Mon, 28 Sept 2020 7:03 PM

ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ముంగిట కోహ్లీని ఊరిస్తున్న రికార్డు


ఐపీయల్ లో ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధం అయింది..ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు అయిన రోహిత్ , కోహ్లీ బరిలోకిదిగుతుండటంతో ఎవరిదీ పైచేయి అవుతది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు..

అయితే ఈ మ్యాచ్ ముంగిట ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తోంది. ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి రాణించి 85 పరుగులు చేస్తే అరుదైన రికార్డును నమోదు చేస్తాడు. టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగుల మార్కును చేరిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు..

ఇప్పటివరకూ 283 టీ20 మ్యాచ్‌ల్లో కోహ్లి 8, 915 పరుగులు చేశాడు. ఒక భారత క్రికెటర్‌గా ఇది అత్యధిక టీ20 పరుగుల రికార్డు. కానీ మరో 85 పరుగులు చేస్తే 9 వేల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి నిలుస్తాడు. ఇప్పుడు కోహ్లిని ఆ రికార్డు ఊరిస్తోంది. ఈ రికార్డు సాధిస్తే ఓవరాల్‌గా కోహ్లి ఏడో క్రికెటర్‌ అవుతాడు.

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో క్రిస్‌ గేల్‌(13, 296) తొలిస్థానంలో ఉండగా, కీరోన్‌ పొలార్డ్‌(10, 238) రెండో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్‌ మెకల్లమ్‌(9,922) మూడో స్థానంలో, షోయబ్‌ మాలిక్‌(9,906) నాల్గో స్థానంలో ఉన్నారు. ఇక డేవిడ్‌ వార్నర్‌(9,318), అరోన్‌ ఫించ్‌(9,088)లు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు.


Tags :
|

Advertisement