Advertisement

  • ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లు

ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లు

By: Sankar Thu, 06 Aug 2020 1:13 PM

ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లు



ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య మంగళవారం రాత్రితో మూడు వన్డేల సిరీస్ ముగియగా.. బుధవారం వన్డే ర్యాంకింగ్స్‌ని ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ టాప్ క్రికెటర్ల ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. కానీ.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఆటగాళ్లు మాత్రం మెరుగైన ర్యాంక్‌లను అందుకున్నారు.

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో నెం.1 స్థానాన్ని కాపాడుకోగా.. 855 పాయింట్లతో ఓపెనర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో 142 పరుగులు చేసిన ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ పాల్ స్టిర్లింగ్ 26వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్‌లో సెంచరీ (113 రన్స్) బాదిన ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్‌బ్రైన్ 42వ ర్యాంక్‌ని చేజిక్కించుకున్నాడు. ఈ వన్డేలోనే 106 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. 22వ స్థానంలో నిలవగా.. రెండో వన్డేలో 82 పరుగులు చేసిన ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టోకి 13వ స్థానం దక్కింది.

ఇక బౌలర్ల ర్యాంకింగ్ లో తొలి స్థానంలో ట్రెంట్ బౌల్ట్ ఉండగా , రెండవ స్థానంలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు ..ఇటీవల ఐర్లాండ్ తో ముగిసిన వన్ డే సిరీస్ లో రాణించిన ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ విల్లీ 51వ స్థానానికి ఎగబాకగా.. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా.. 29వ స్థానం నుంచి 25వ స్థానానికి ఎగబాకాడు.

Tags :
|
|

Advertisement