వన్ డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్న భారత స్టార్ ఆటగాళ్లు ..
By: Sankar Wed, 29 July 2020 11:37 AM
ఐసీసీ వన్ డే ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ ఆటగాళ్లు కోహ్లీ , రోహిత్ మొదటి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు ..కరోనా వైరస్ కారణంగా ఐదు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కి టీమిండియా దూరంగా ఉండిపోగా.. వచ్చే ఏడాది జనవరి వరకూ భారత్ జట్టు మళ్లీ వన్డేలు ఆడే సూచనలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై జనవరి 12 నుంచి 17 వరకూ కంగారూలతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా తలపడనుంది..
బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. వైస్ కెప్టెన్/ఓపెనర్ రోహిత్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక పాక్కి చెందిన బాబర్ అజామ్ (829), న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ (818), దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (790) పాయింట్లతో టాప్-5లో కొనసాగుతున్నారు.
ఇక బౌలర్ల ర్యాంకింగ్స్లో కూడా టీం ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా సత్తా చాటాడు .. 719 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు..అయితే మొదటి స్థానంలో కివీస్ స్టార్ బావెర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు .. ఆ తర్వాత స్థానాల్లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (701), పాట్ కమిన్స్ (689), కగిసో రబాడ (665) టాప్-5లో నిలిచారు. ఇక ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ రవీంద్ర జడేజా 286 పాయింట్లతో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.