Advertisement

  • అభిమానులకు శుభవార్త చెప్పిన కోహ్లీ , అనుష్క దంపతులు

అభిమానులకు శుభవార్త చెప్పిన కోహ్లీ , అనుష్క దంపతులు

By: Sankar Thu, 27 Aug 2020 1:06 PM

అభిమానులకు శుభవార్త చెప్పిన కోహ్లీ , అనుష్క దంపతులు


టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విటర్‌ వేదికగా అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు.'ప్రస్తుతం నా భార్య గర్భవతి..త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్‌షిప్‌లో ది మోస్ట్‌ మొమరబుల్‌ మూమెంట్‌ ఇదే అని అన్నారు

ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నాం.' అంటూ పేర్కొన్నాడు. కాగా ట్విటర్‌లో విరాట్‌ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్‌గా దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2013 నుంచి రిలేషిన్‌షిప్‌లో విరుష్క జోడి.. 2017లో ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు..

అయితే 2017 డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మ. వారి వారి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్న ఈ జోడీ లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే గడుపుతున్నారు. అలా భర్త విరాట్ కోహ్లీతో కలిసి సరదాగా సమయం గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా ఈ శుభవార్త చెప్పి తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపేసింది. చివరగా జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క.. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు.

Tags :
|

Advertisement