Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వీడియో

By: chandrasekar Wed, 22 July 2020 4:40 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వీడియో


ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనందరం ఒక కథ చదివే ఉంటాం. ఇద్దరు మిత్రులు అడవిలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఎదురొస్తుంది. అందులో ఒకతను తప్పించుకోవడానికి చెట్టుపైకి ఎక్కితే ఇంకో వ్యక్తి ఎలుగుబంటికి దొరికిపోతాడు. తప్పించుకోవడానికి చనిపోయినట్టు నటిస్తాడు. ఎలుగుబంటి చనిపోయినట్టు నటిస్తున్న అతని దగ్గరికి వెళ్లి రెండు నిమిషాలు చూసి వెళ్లిపోతుంది.

అలాంటిదే ఈ వీడియోలో కూడా జరిగింది. ఈ ట్రెండింగ్ వీడియోలో ముగ్గురు అమ్మాయిలో అడవిలో వెళ్తుండగా ఒక ఎలుగుబంటి ఎదురొస్తుంది. దాంతో ఆ అమ్మాయిలు ముందు ఖంగారు పడినా తరువాత తేరుకుని చిన్నప్పుడు విన్న కథను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కదలకుండా అలాగే నిలబడతారు.

ఎలుగుబంటి వారిని కదిలించడానికి ప్రయత్నించినా వాళ్లు ఏం చేయరు. అలాగే నిలబడతారు. అలా కొద్దిసేపు వారిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ అమ్మాయిల నేర్పుని మెచ్చుకుంటున్నారు.

Tags :
|
|
|
|

Advertisement