Advertisement

బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

By: Sankar Sun, 20 Sept 2020 4:56 PM

బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు


విజయవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కథనం మేరకు..ఆన్ లైన్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు నిర్వహించింది ఈ ముఠా. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఠా బెజవాడలో ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తోంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ సెటప్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ‘మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. బెట్టింగ్ ఎక్విప్మెంట్ మొత్తం స్వాధీనం చేసుకున్నాం. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడతారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది. ప్రధాన సూత్రధారి నవీన్ ను త్వరలో అదుపులోకి తీసుకుంటాం.

ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్ పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలి. ఈ వ్యాలెట్ ద్వారా నగదు వ్యవహారాలు చేస్తున్నారు. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్ లకు ఆకర్షితులు కావద్దని కోరుతున్నాం’ అని సూచించారు..కాగా ఎంతో మంది యువత ఈ బెట్టింగ్ మహమ్మారి మాయలో పది తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు..సులువుగా డబ్బులు సంపాదించొచ్చు ఎన్ భ్రమలో చాల మంది బెట్టింగ్ లోకి దిగి సర్వం పోగొట్టుకుంటున్నారు..అసలెయ్ ఐపీయల్ కూడా ప్రారంభం అవ్వడంతో ఈ బెట్టింగ్ మాఫియా మరింతగా విజృంభించే అవకాశం ఉంది..

Tags :
|
|

Advertisement