బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ ..కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
By: Sankar Fri, 16 Oct 2020 2:32 PM
అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ఎట్టకేలకు ప్రారంభమైంది.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్లో కనకదుర్గ ఫ్లై ఓవర్ను ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, వీకే సింగ్, ఏపీ మంత్రి శంకర్నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల, సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎప్పుడో నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న ఈ ఫ్లైవర్ ప్రారంభానికి ముహూర్తం పెట్టినా.. వాయిదా పడుతూ వచ్చింది.. చివరిసారి కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్గా రావడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇక, రూ. 502 కోట్లతో 6 వరుసలతో 2.6 కి.మీ మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. మరోవైపు దుర్గగుడి ఫ్లైఓవర్తో పాటు ఏపీలో 61 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.. మొత్తం రూ.15,592 కోట్ల పనులకు భూమి పూజలు నిర్వహించారు. 16 ప్రాజెక్టులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు.. 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులును జాతికి అంకితమిచ్చారు. దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభంతో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి.. కాగా, అధికారికంగా ప్రారంభించకపోయినా.. ఇప్పటికే ఫ్లైఓవర్పై వాహనాలకు అనుమతిస్తున్నారు. ఇక, ఇవాళ అధికారికంగా ప్రారంభించారు.