Advertisement

  • దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై ట్విట్టర్లో స్పందించిన విజయశాంతి

దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై ట్విట్టర్లో స్పందించిన విజయశాంతి

By: chandrasekar Wed, 11 Nov 2020 10:03 AM

దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై ట్విట్టర్లో స్పందించిన విజయశాంతి


దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిపై విజయశాంతి ట్విట్టర్లో స్పందించారు. టీఆర్‌ఎస్‌ అహంకారపూరిత ధోరణులకు, సీఎం కేసీఆర్‌ నిరంకుశ పోకడలకు దుబ్బాక తీర్పు జవాబు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలపై ఆమె ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ఇప్పుడున్న అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో దుబ్బాక ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. విజయశాంతి కొద్దీ రోజుల్లో బీజేపీలో చేరుతారని వస్తున్న కథనాల నేపథ్యంలో ఆమె దుబ్బాక ఎన్నికల ఫలితాలపై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు కేసీఆర్ దొరగారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని తెలిపారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారు. ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆరెస్ అంటోంది.

కానీ ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆరెస్ నాయకుల చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టీఆరెస్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి. ఏది ఏమైనా దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజం రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలనా ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు. అని విజయశాంతి ట్వీట్ చేశారు. ఈ విధంగా తన వ్యతిరేకతను వెలిబుచ్చారు.

Tags :
|

Advertisement