Advertisement

  • నర్సులకు జరుగుతున్న అన్యాయానికి సీఎం ఫై మండిపడ్డ విజయశాంతి

నర్సులకు జరుగుతున్న అన్యాయానికి సీఎం ఫై మండిపడ్డ విజయశాంతి

By: chandrasekar Mon, 13 July 2020 1:45 PM

నర్సులకు జరుగుతున్న అన్యాయానికి సీఎం ఫై మండిపడ్డ విజయశాంతి


పీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ దొరగారి పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలే చెబుతున్నాయని అన్నారు.

కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఎన్ని అవమానాల పాలవుతున్నారో నర్సుల ఆందోళన చూస్తే తెలుస్తుందన్నారు.

పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన నర్సులకు జవాబు చెప్పలేక సర్కారు నీళ్ళు నములుతోందని మండిపడ్డారు.

ఇక‌ ఆర్టీసీ సిబ్బందికి అందిన జూన్ నెల జీతాల్లోనూ ఆందోళన నెలకొందని, దారుణమైన కోతలతో ఆర్టీసీ సిబ్బందికి జీతాలిచ్చార‌ని అన్నారు. ఆ జీతం డబ్బులతో ఎలా బతుకు నడపాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండవలసిన సీఎం గారు ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉంటారో ప్రగతిభవన్‌కు ఎప్పుడొస్తారో తెలియని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? సీఎం గారు జవాబు చెప్పాలన్నారు.

Tags :
|

Advertisement