బీజేపీ గూటికి చేరిన విజయశాంతి...!
By: Anji Mon, 07 Dec 2020 11:07 PM
విజయశాంతి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ కండువా కప్పి రాములమ్మను పార్టీలోకి ఆహ్వానించారు ఆరుణ్ సింగ్.
బీజేపీ ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టిన రాములమ్మ సుమారు రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. కాగా ఆదివారం సాయింత్రం రాములమ్మ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటి అయిన సంగతి తెలిసిందే.
1998లో మహిళా మోర్చా కార్యదర్శిగా బీజేపీలో రాజకీయ ప్రవేశం చేసిన విజయశాంతి… దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆమె తిరిగి బీజేపీ గూటికి చేరుకున్నారు… ఇక, మధ్యలో టీఆర్ఎస్లో చేరి ఎంపీగా విజయం సాధించిన ఆమె.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు..
జనరల్ ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉన్న ఆమె.. ఆ తర్వాత బీజేపీ నేతల వరుస భేటీలతో ఆ పార్టీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే.