Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నిక ...తెరాస పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విజయశాంతి

దుబ్బాక ఉప ఎన్నిక ...తెరాస పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విజయశాంతి

By: Sankar Tue, 27 Oct 2020 12:34 PM

దుబ్బాక ఉప ఎన్నిక ...తెరాస పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విజయశాంతి


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అధికార టీఆర్ఎస్ పార్టీ పై మరోసారి ఫైర్ అయింది. "దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా కాదా అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి." అంటూ ఫైర్ అయింది విజయశాంతి. కాగా దుబ్బాక ప్రచారం వేడెక్కింది. ఇప్పటికే ప్రచారంలో నువ్వా?నేనా? అన్నట్టుగా పోటీపడుతున్నారు పాలక, ప్రతిపక్షాలు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరపున అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు .. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. ఈసారైనా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేస్తుండగా.. ఒక్కసారి గెలిపించి చూడండని బీజేపీ కోరుతోంది. మొత్తంగా, పార్టీలన్నీ ఓటర్లను కాకా పట్టడంలో బిజీ అయ్యాయి. కాగా, నవంబర్‌ 3న, దుబ్బాకలో పోలింగ్‌ జరగనుండగా.. 10న ఫలితం వెల్లడికానున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement