Advertisement

  • తిరుమలలో శ్రీవారికి విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం

తిరుమలలో శ్రీవారికి విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం

By: chandrasekar Mon, 26 Oct 2020 1:05 PM

తిరుమలలో శ్రీవారికి విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం


తిరుమలలో శ్రీవారికి విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం జరుపబడింది. శ్రీవారి ఆలయంలో విజ‌యద‌శ‌మి పార్వేట ఉత్స‌వం ఆదివారం ఏకాంతంగా జ‌రిగింది. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసిన‌ మ‌రుస‌టి రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాదు సంక్రాంతి క‌నుమ పండుగ రోజు కూడా తిరుమ‌ల‌లో పార్వేట ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. ఇది శ్రీవారికి అనవాయితీగా నిర్వహిస్తున్న ఉత్సవం.

ఈ పార్వేట ఉత్స‌వం సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణోత్స‌వ‌ మండపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపు చేశారు. శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు పంచాయుధాలైన శంఖం, చ‌క్రం, గ‌ద‌, ఖ‌డ్గం, ధ‌నస్సు ధ‌రించి పార్వేట ఉత్స‌వంలో పాల్గొన్నారు. ఈ ఉత్స‌వంలో భాగంగా టిటిడి ఈవోకు ఆల‌య మ‌ర్యాద ప్ర‌కారం ప‌రివ‌ట్టం కట్టారు.

Tags :

Advertisement