తిరుమలలో శ్రీవారికి విజయదశమి పార్వేట ఉత్సవం
By: chandrasekar Mon, 26 Oct 2020 1:05 PM
తిరుమలలో శ్రీవారికి విజయదశమి
పార్వేట ఉత్సవం జరుపబడింది. శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఆదివారం
ఏకాంతంగా జరిగింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి
రోజున ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాదు సంక్రాంతి కనుమ పండుగ రోజు కూడా తిరుమలలో
పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. ఇది శ్రీవారికి అనవాయితీగా నిర్వహిస్తున్న
ఉత్సవం.
ఈ పార్వేట ఉత్సవం సందర్భంగా
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ
మండపంలో శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేశారు. శ్రీమలయప్పస్వామివారు
పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు ధరించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ
ఉత్సవంలో భాగంగా టిటిడి ఈవోకు ఆలయ మర్యాద ప్రకారం పరివట్టం కట్టారు.