విజయ్ మాల్యా విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడీ...
By: chandrasekar Sat, 05 Dec 2020 4:54 PM
మద్యం వ్యాపారి విజయ్
మాల్యా విదేశీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఫ్రాన్స్లోని రూ.14 కోట్ల
విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సీజ్ చేసినట్లు శుక్రవారం ఈడీ
తెలియజేసింది. ఈడీ విజ్ఞప్తితో ఫ్రాన్స్ అధికారులు ఈ ఆస్తులను స్వాధీనం
చేసుకున్నారు.
ఫ్రాన్స్లోని 32
ఎవెన్యూ ఎఫ్వోసీహెచ్ వద్దనున్న ప్రాపర్టీని జప్తు చేసినట్లు ఓ ప్రకటనలో ఈడీ
అధికారులు తెలియజేశారు. దీని విలువ 1.6 మిలియన్ యూరోలు (దాదాపు రూ.14
కోట్లు)గా తెలిపారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి
విదేశాలకు పెద్ద ఎత్తున నగదు మళ్లింపు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ
ప్రకటించింది. బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా 2016లో
దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.