Advertisement

  • తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ...

తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ...

By: chandrasekar Fri, 30 Oct 2020 9:40 PM

తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విజ‌య్ దేవ‌ర‌కొండ...


తెలంగాణ ప్ర‌భుత్వంపై సినీ న‌టుడు విజ‌య్ దేవ‌రకొండ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌ని ప్రశంసించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అద్భుత‌మైన పాల‌సీల‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నార‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎలక్ట్రిక్‌ వెహి‌కిల్‌ పాల‌సీ విడుద‌ల కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాల్గొని ప్ర‌సంగించారు. గ‌తంలో స‌మ‌స్య‌లు వ‌స్తే ప‌రిష్క‌రించేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టేది. ఇప్పుడు ఆ స‌మ‌స్య లేద‌న్నారు. ముందు చూపుతో స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంద‌న్నారు.

త‌మ జిల్లాతో పాటు గ్రామానికి సాగు నీరు వ‌చ్చింద‌న్నారు. 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇవ్వ‌డం, సాగునీరు రావ‌డం వ‌ల్ల రైతులు రెండు పంట‌లు వేసుకుంటున్నారు. భూముల ధ‌ర‌లు కూడా పెరిగాయ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లు భారీగా వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ వెహిక‌ల్స్‌దే భ‌విష్య‌త్ అని అన్నారు. ఎలక్ట్రిక్ వెహిక‌ల్స్ వ‌చ్చే జ‌న‌వరి నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని, తద్వారా హైద‌రాబాదీల లైఫ్ స్టైల్ మార‌బోతుంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ పేర్కొన్నారు.

Tags :

Advertisement