Advertisement

తన ఆరోగ్యం బాగానే ఉందన్న ఉప రాష్ట్రపతి

By: chandrasekar Thu, 01 Oct 2020 4:53 PM

తన ఆరోగ్యం బాగానే ఉందన్న ఉప రాష్ట్రపతి


ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్‌ నుంచి బయటపడేందుకు వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నానని తెలిపారు. మాల్దీవులు ఉపాధ్యక్షుడు ఫైజల్‌ నసీం చేసిన ట్వీట్‌కు బదులిస్తూ వెంకయ్య నాయుడు ఈవిధంగా పేర్కొన్నారు. తాను త్వరగా కోలుకోవాలంటూ కోరుకున్నవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడినట్టు ఆయన కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం రొటీన్‌గా కరోనా పరీక్షలు చేయించుకున్నప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ నమోదయ్యిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన సతీమణి ఉషా నాయుడుకు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

వెంకయ్య నాయుడుకి కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఫైజల్‌ నసీం కూడా వెంకయ్య ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. వెంకయ్య దీనికి బదులిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :
|

Advertisement