Advertisement

  • రామ మందిర నిర్మాణానికి , కరోనా పోరాటానికి విరాళం ఇచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం

రామ మందిర నిర్మాణానికి , కరోనా పోరాటానికి విరాళం ఇచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం

By: Sankar Wed, 05 Aug 2020 7:43 PM

రామ మందిర నిర్మాణానికి , కరోనా పోరాటానికి విరాళం ఇచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం



అయోధ్యలో నిర్మించనున్న రామాలయం నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబం విరాళం అందజేసింది. అదేవిధంగా పీఎం కేర్స్ నిధికి కూడా తమ వంతు విరాళం అందజేయాలని నిర్ణయించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య సతీమణి శ్రీమతి ఉషమ్మ చొరవ తీసుకుని కుమారుడు హర్ష, కోడలు రాధ, కుమార్తె దీపావెంకట్, అల్లుడు వెంకట్ ఇమ్మణ్నితో కలిసి చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు పీఎం కేర్స్ నిధికి రూ.5 లక్షలు, అదేవిధంగా అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం కోసం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు మరో రూ.5 లక్షల చెక్కును పంపించారు.

అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఏడాది మార్చిలో కరోనా పోరాటానికి గానూ పీఎం కేర్స్ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వడంతోపాటు.. కరోనా పరిస్థితులు చక్కబడేంతవరకు ఈ నిధికి తన వేతంలో 30 శాతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు

Tags :
|
|
|

Advertisement