Advertisement

  • కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..

By: Sankar Mon, 12 Oct 2020 9:27 PM

కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..


కరోనా నుండి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోలుకున్నారు. కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచన మేరకు నా స్వీయ నిర్బంధ కాలం పూర్తయిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ రోజు ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చిందని, ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.

అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నానని అన్నారు. స్వీయనిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతో మంది నా ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేశారు. అన్ని ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారు. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.

కరోనా సమయంలో నాకు అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. నాకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన నా వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.

Tags :
|

Advertisement