- హోమ్›
- వార్తలు›
- కరోనా వ్యాక్సిన్పై భజ్జీ ట్వీట్ కి వేటిజన్ల రియాక్షన్..ఇది క్రికెట్ మ్యాచ్ కాదు రివ్యూ కోరడానికి...
కరోనా వ్యాక్సిన్పై భజ్జీ ట్వీట్ కి వేటిజన్ల రియాక్షన్..ఇది క్రికెట్ మ్యాచ్ కాదు రివ్యూ కోరడానికి...
By: chandrasekar Thu, 03 Dec 2020 11:20 PM
బ్రిటన్ తాజాగా ఫైజర్
వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మోడెర్నా, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు
సైతం కరోనాతో సమర్థవంతంగా పోరాడుతున్నాయని తేలింది. ఫైజర్ వ్యాక్సిన్కు బ్రిటన్
అనుమతులు ఇవ్వడంతో.. త్వరలోనే మన దేశంలోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశలు
చిగురించాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కరోనా
వ్యాక్సిన్ అవసరమా అని ట్వీట్ చేసి ట్రోలింగ్ గురయ్యాడు. ‘‘ఫైజర్ అండ్ బయోటెక్
వ్యాక్సిన్ కచ్చితత్వం 94 శాతం, మోడెర్నా వ్యాక్సిన్ కచ్చితత్వం 94.5 శాతం, ఆక్స్ఫర్డ్
వ్యాక్సిన్ కచ్చితత్వం 90 శాతం.. కానీ భారతీయుల కరోనా రికవరీ రేటు 93.6 శాతం.
నిజంగా మనకు వ్యాక్సిన్ అవసరమా..?’’
భజ్జీ ట్వీట్ చేశాడు.
హర్భజన్ చేసిన ఈ ట్వీట్కు
నెటిజన్లు తమదైన రీతిలో బదులిస్తున్నారు. కొందరు భజ్జీని ట్రోల్ చేయగా.. మరికొందరు
అతడికి వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి వివరించారు. నీ లాజిక్ చూసి సైంటిస్టులు
ఏడుస్తున్నారంటూ ఓ నెటిజన్ ట్రోల్ చేయగా మొదటి లక్ష కరోనా మరణాలకు వంద రోజులు
పడితే చివరి లక్ష మరణాలు 10
రోజుల్లోనే సంభవిస్తాయని ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో మరణించే వారి సంఖ్య
తక్కువగా ఉండొచ్చు. కానీ కరోనా కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్నాయని మరో నెటిజన్ భజ్జీకి
వివరించాడు. కరోనా నుంచి రికవరీ రేటు ఇండియాలో 93.6 శాతం ఉంది. వ్యాక్సిన్
వేయడం వల్ల 94.6 శాతం మందికి రక్షణ లభిస్తుంది. ఇందులో రికవరీ కాని 6.4 శాతం
మంది కూడా ఉంటారు. వంద కోట్ల మందికిపైగా జనాభా ఉన్న దేశంలో వ్యాక్సిన్ ఎంతో
అవసరమని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
ఇది క్రికెట్ మ్యాచ్ కాదు
రివ్యూ కోరడానికి.. మిగతా 6.4 శాతం మందికి 2021 ఉండదంటూ మరో నెటిజన్ ఘాటుగా బదులిచ్చారు. ఇలాంటి
స్టుపిడ్ ట్వీట్లు చేయకు.. 140 కోట్ల మందిలో 6.4 శాతం అంటే ఎంత మంది..? ట్వీట్ చేసే ముందు సైన్స్
నేర్చుకో అంటూ ఓ నెటిజన్ భజ్జీకి చురకలు అంటించాడు. కొందరు హర్భజన్కు బాగా అర్థమయ్యే
క్రికెట్ భాషలోనే బదులిచ్చారు.