Advertisement

  • కరోనా బాధితులకు అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అందించిన వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ అధినేత

కరోనా బాధితులకు అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అందించిన వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ అధినేత

By: chandrasekar Fri, 07 Aug 2020 3:47 PM

కరోనా బాధితులకు అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అందించిన వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ అధినేత


కరోనా బాధితులకు అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అందించిన వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ అధినేత వెంక‌టేశ్వ‌ర‌రావు. వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ నుంచి క‌రోనా బాధితుల‌కు సేవ‌లందించేందుకు ఓ అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా అంద‌చేశారు. అందుకు కావాల్సిన నిధుల‌ను చెక్కు రూపంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి అంద‌చేశారు. కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులు చూసి తన ఉదారతను చాటుకున్నారు.

ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తిని అరికాట్టాలని గుర్తుచేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. క‌రోనా బాధితులు అంద‌రినీ ఆదుకోవ‌డం ఆరోగ్యంగా ఉన్న మిగిలిన వారి బాధ్య‌త‌గా మారాల‌న్నారు. వెంక‌టేశ్వ‌ర గ్రానైట్స్ అధినేత వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న వంతుగా ఒక అంబులెన్స్ వాహ‌నాన్ని ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇచ్చిన పిలుపు మేర‌కు క‌రోనా రోగుల స‌హాయార్థం తాను ఒక అంబులెన్స్‌ను అంద‌జేసిన‌ట్లు తెలిపారు. డ‌బ్బులు సంపాదించ‌డం ఒక్క‌టే మార్గంగా ఉండొద్ద‌ని సంపాద‌న‌లో కొంత భాగాన్ని ఆపదలో వున్న వారిని ఆదుకోవ‌డానికి ఉప‌యోగించాల‌న్నారు. త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన మంత్రి ఎర్ర‌బెల్లికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. అందరూ మాస్కులు ధరించి వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలతో బయటకు రావాలని సూచించారు.

Tags :
|

Advertisement