Advertisement

చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు

By: chandrasekar Thu, 04 June 2020 6:57 PM

చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు


కూరగాయల ధరలు కుడా పెరిగిపోవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయల ధరలు ఏం కొనాలన్న కిలో రూ. 60 నుంచి రూ.70 వరకు ఉన్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు ఏం తినాలో తెలియక ఏం కొనాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు చికెన్ కిలో ధరూ. 100గా లేదు. ఇప్పుడు మాత్రం అమాంతం రూ. 300కు చేరింది. కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ.1000వరకు ఉంది. ఇప్పుడు కూరగాయలు ధరలు సైతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అటు నాన్ వెజ్ కొనలేక ఇటు వెజిటేబుల్స్ కూడా కొనలేక జనం ఇబ్బందులు పడుతున్నారు.

లాక్‌డౌన్‌లో సమయంలో కిలో రూ.10 నుంచి రూ.20 లోపు లభించే కాయగారుల ధరలు ప్రస్తుతం అన్ని పెరిగిపోయాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ఘాటెక్కిస్తోంది. ఇటీవల కిలో రూ.20 పలికిన పచ్చిమిర్చి ఇప్పుడు హోల్‌సెల్‌లో రూ.50 కాగా రిటైల్‌గా రూ.60కి చేరింది. బీన్స్‌, కాకర, చామదుంప, బంగాళదుంప, వంటి కూరగాయలు రూ.30 దాటిపోగా, పెద్దచిక్కుళ్ళు కిలో రూ.60కి చేరింది. ఆలూ కూడా కిలో రూ. 50గా ఉంది. గోరుచిక్కుడు, బెండ, దొండకాయ కూడా కిలో రూ.40ల పైగా వుంది. లాక్‌డౌన్‌ సమయంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉదయం సమయంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో తోపుడు బండ్ల ద్వారా కూరగాయలను విక్రయించారు.

లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో తాత్కాలికంగా కూరగాయల వ్యాపారం చేసిన వారంతా తమ వృత్తుల్లోకి వారు వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు గతంలో చేసిన వ్యాపారులు మాత్రమే కూరగాయలు విక్రయిస్తుండటంతో వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నారు. రోజురోజుకు వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఆకు కూరలు కూడా అలాలే ఉన్నాయి. గతంలో పది రూపాయలకు 6 నుంచి 7 కట్టలు ఇచ్చే ఆకు కూరలు కేవలం ఇప్పుడు మూడో నాలుగో ఇస్తున్నారు. రోజురోజుకు అన్ని ధరలు పెరిగిపోతుండంతో ఏం తినాలో ఏం కొనాలో తెలియక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :
|

Advertisement