ఇలాంటి ఆటతీరుతో టీం ఇండియా ఆస్ట్రేలియాలో గెలవలేదు....మైకేల్ వాన్
By: Sankar Sat, 28 Nov 2020 8:05 PM
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఘోర పరాభవం తప్పదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఆసీస్పై టీమిండియా ఏ సిరీస్ను గెలుచుకునే అవకాశమే లేదని ఎద్దేవా చేశాడు.
ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి చెందడాన్ని ప్రస్తావిస్తూ మిగతా మ్యాచ్ల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని విమర్శించాడు. పేలవమైన ఫీల్డింగ్, సాధారణ బౌలింగ్తో ఆసీస్పై సిరీస్లను గెలవలేదన్నాడు. ఈ మేరకు ట్వీటర్ వేదికగా వాన్ స్పందించాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ తొలి వన్డేలోనే తన సత్తా చూపిట్టిందన్నాడు.
ఈ ద్వైపాక్షిక సిరీస్లో ఆసీస్దే పైచేయి అవుతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత ఆసీస్ పర్యటనలో కోహ్లి గ్యాంగ్కు చుక్కెదరవడం ఖాయమన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల గురించి ఆలోచించడం ఆ జట్టు ఇంకా ‘ ఓల్డ్ స్కూల్’లో ఉన్నట్లే కనబడుతుందన్నాడు. ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో ఆడితే కింది స్థాయిలో తగినంత బ్యాటింగ్ ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నాడు