Advertisement

  • వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్లో చేర్చబడ్డారు

వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్లో చేర్చబడ్డారు

By: chandrasekar Wed, 26 Aug 2020 08:57 AM

వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్లో చేర్చబడ్డారు


ప్రముఖ నటి ఇటీవల్ల వివాహం చేసుకోవడంతో సంచలనం రేపిన వనితా విజయ్ కుమార్ మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్‌లో చేర్చబడ్డారు. తమిళ నటి వనితా విజయ్ కుమార్‌ జీవితానికి మరో పరీక్ష మొదలైంది. ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకొనన మూడో భర్త తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. దాంతో వనితా ఓ రకమైన బాధలో మునిగిపోయారు. తన భర్త పీటర్‌ పాల్‌ను హాస్పిటల్‌లో చేర్పించిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జూన్‌ మాసంలో వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకోవడం తమిళ పరిశ్రమలో సంచలనం రేపింది. వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లిపై సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తన పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై సినీ ప్రముఖులపై వనితా మండిపడ్డారు. ప్రస్తుతం వనితా విజయ్ కుమార్‌కు మరో కష్టం వచ్చి పడింది.

ఆమె పెళ్లి చేసుకున్న మూడో భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో హస్పిటల్‌లో చేరారు. ఆయనక తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని వనితా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భర్త ఆరోగ్యంపై వనితా విజయ్ కుమార్ ఆవేదన తన భర్త పీటర్ ఆరోగ్యంపై వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ చాలా బాధను పంచుకోవాలి ఈ పరిస్థితుల్లో ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. దేవుడుపైనే భారం వేశాను. ఇలాంటి పరీక్షలు నాకే ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు. జీవితం మరీ దుర్భరంగా మారింది అంటూ వనిత విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా విధి రాసిన రాతను తప్పించలేం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాల్సిందే. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడే మనమేంటో ప్రపంచానికి తెలుస్తుంది అంటూ వనితా విజయ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆమె భర్త త్వరగా కోలుకోవాలని అభిమానులంతా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Tags :

Advertisement