Advertisement

  • వంశీ మరియు యార్లగడ్డ చేతులు కలిపి సయోధ్య దిశగా అడుగేసిన జగన్

వంశీ మరియు యార్లగడ్డ చేతులు కలిపి సయోధ్య దిశగా అడుగేసిన జగన్

By: chandrasekar Fri, 09 Oct 2020 2:25 PM

వంశీ మరియు యార్లగడ్డ చేతులు కలిపి సయోధ్య దిశగా అడుగేసిన జగన్


వల్లభనేని వంశీ మరియు యార్లగడ్డ వెంకట్రావుల మధ్య చేతులు కలిపి సయోధ్య దిశగా జగన్ అడుగులేశారు. గన్నవరం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో వర్గపోరుకు చెక్ పెట్టే పనిలో అధినేత జగన్ ఉన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ-యార్లగడ్డ వెంకట్రావుల మధ్య సయోధ్య దిశగా తొలి అడుగు వేశారు. గురువారం జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవానికి వెళ్లిన జగన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నేతల్ని పలకరించారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన నేతలు సీఎంను కలిశారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దేవినేని అవినాష్ ఇతర నేతలు అక్కడ కనిపించారు. పార్టీ నేతల్ని ముఖ్యమంత్రి పలకరించే క్రమంలో వంశీ, వెంకట్రావు

ప్రక్క ప్రక్కనే ఉన్నారు. వెంటనే జగన్ ఇద్దరు చేతుల్ని కలిపారు. కలిసి పనిచేసుకోవాలని చెప్పారు. వంశీ యార్లగడ్డ వైపు చూసి నవ్వారు. కానీ ఆయన మాత్రం ఏమీ అనకుండా అలాగే నిలబడిపోయారు. ఈలోపు వెంకట్రావు ఏదో చెప్పబోగా జగన్ ముందుకు కదిలారు. ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని అధినేత జగన్ పరోక్షంగా చెప్పారు. మరి వెంకట్రావు వర్గం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. కొద్దిరోజులుగా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు గ్రూపుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

వల్లభనేని వంశీ వర్గం ఇటీవల వెంకట్రావు పుట్టిన రోజు వేడుకల్ని అడ్డుకుంటుందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వల్లభనేనిని యార్లగడ్డ నేరుగా టార్గెట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేసేది లేదని ఈ విషయాన్ని నేరుగా జగన్‌కే చెప్పానన్నారు. వంశీ పార్టీలోకి వచ్చాక నియోజకవర్గంలోకి రాకూడదనుకున్నా కానీ తనను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని అడుగు పెట్టాను అన్నారు. తన పుట్టిన రోజు వేడుకలకు వెళుతుంటే పోలీసులు ఆరుసార్లు తనను ఆపారని ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తనకు తెలుసు అని యార్లగడ్డ అన్నారు. తన పుట్టిన రోజు వేడుకల నిర్వహణ విషయంలో పోలీసుల ఆంక్షల పెట్టారని ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్నారు. తమపై మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని పోలీసులు చెబుతున్నారన్నారు యార్లగడ్డ. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని వారి కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమన్నారు. ఎమ్మెల్యే వంశీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను తన జన్మదిన వేడుకలు జరపొద్దని ఇబ్బంది పెట్టారని వంశీతో తాను కలిసి పని చేయటం జరగదన్నారు. వీరిమధ్య జగన్ పరోక్షంగా సయోధ్య చేసారు మరియు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Tags :
|
|

Advertisement