Advertisement

  • ఇక నుంచి తెలంగాణాలో ఆ బస్సుల్లో కరోనా పరీక్షలు

ఇక నుంచి తెలంగాణాలో ఆ బస్సుల్లో కరోనా పరీక్షలు

By: Sankar Sun, 13 Sept 2020 12:28 PM

ఇక నుంచి తెలంగాణాలో ఆ బస్సుల్లో కరోనా పరీక్షలు


తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ సంస్థ పూర్తిగా నష్టాలలో కూరుకుపోయింది. కొందరు ఉద్యోగులకు అయితే సగం జీతాలు అందుతున్నాయి. ఓ వైపు వజ్ర మినీ బస్సులు కూడా ఓ నష్టాలు మూటగట్టింది. దీంతో వాటిని తిరగకుండా ఆపేసింది సర్కార్. అయితే ఇప్పుడు ఇవే బస్సులు కోవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్చేసింది.

తెలంగాణలో ఇటీవలే ఓ 3 వజ్రా బస్సులను కోవిడ్‌ సంచార పరీక్షాకేంద్రాలుగా ప్రయోగాత్మకంగా మార్చారు. ఆ బస్సులను రవాణామంత్రి పువ్వాడ అజయ్‌ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా ప్రతి రోజు ఎంత లేదనుకున్నా సుమారుగా 750 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉండడంతో మరి కొన్ని వజ్ర బస్సులను సంచార ల్యాబ్‌లుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.

డిపోల్లోని వజ్ర మినీ బస్సుల వినియోగం చాలా తక్కువగా ఉండటంతో పాటు కొన్ని యాక్సిడెంట్లు, మరమ్మతులతో మూలన పడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సంచార పరీక్ష కేంద్రాలుగా మినీ బస్సులపై ప్రయోగం సక్సెస్ కావడంతో వాటిని కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఆరంభమైందని సమాచారం..

Tags :
|
|
|

Advertisement