ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్
By: Sankar Sat, 29 Aug 2020 3:38 PM
ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సీంధర్ భగత్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ ఉదయం ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నేను శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా. ఈ ఉదయం ఆ పరీక్షల రిపోర్టులు వచ్చాయి. నాకు కరోనా పాజిటివ్గా తేలింది. ఇటీవల నాతో సన్నిహితంగా మెలిగిన పార్టీ కార్యకర్తలు, ఇతరులు ఎవరైనా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్ వస్తే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండండి. ప్రస్తుతం నేను హోంక్వారెంటైన్లోనే ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో నేను త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా అని బన్సీంధర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, గత నెలలో ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ మంత్రి సత్పాల్ మహరాజ్, ఆయన భార్య అమృతా రావత్, అతని కుటుంబసభ్యులు, సిబ్బంది కలిసి మొత్తం 21 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లో ఇప్పటివరకు 5,502 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 239 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మడీ మీద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..మోడీ పేరు చూసి వోట్ వేసే రోజులు పోయాయి ..ఎమ్యెల్యే లు అందరు ప్రజలకు సేవ్ చేస్తేనే గెలుస్తారు అంటూ వ్యాఖ్యానించారు