Advertisement

దారుణం: గర్భిణి కడుపు కోసిన కసాయి భర్త

By: Anji Mon, 21 Sept 2020 10:24 AM

దారుణం: గర్భిణి కడుపు కోసిన కసాయి భర్త

త్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తనకు పుట్టబోయే బిడ్డ అడా, మగ అని తెలుసుకునేందుకు ఓ కసాయి భర్త, భార్య కడుపును చీల్చి చూసే ప్రయత్నం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

సివిలైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నాలల్ (35) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ప్రస్తుతం భార్య ఏడునెలల గర్భిణి కూడా. అయితే, ఇప్పటికే ఐదుగురికి జన్మనిచ్చినా.. నిందితుడు తనకు కొడుకు కావాలంటూ భార్యను నిత్యం వేదించేవాడు. ఇదే క్రమంలో ఆరోసారి గర్భం దాల్చింది ఆ మహిళ. ప్రస్తుతం ఆమె ఏడునెలల గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? తెలుసుకోవాలని పట్టుబట్టాడు.

తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు పదునైన చాకుతో భార్య గర్భాన్ని చీల్చాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేని బాధితురాలి కేకలు వేసింది. బాధితురాలి అరుపులకు అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకునేసరికి ఆమె తీవ్రస్రావంతో కుప్పకూలింది. దీంతో ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Tags :

Advertisement