తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్
By: chandrasekar Wed, 03 June 2020 2:43 PM
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
కుమార్ రెడ్డిని నల్గొండ జిల్లా మాల్ దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఉత్తమ్ తెలంగాణ ఆవిర్భావ
దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి
చేశారన్నారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినా
సీఎం కేసీఆర్ కు కనీసం కనికరం లేకుండా
పోయిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు
దగ్గర వేలమంది ఉండొచ్చు కానీ ముగ్గురం సీనియర్ నాయకులం ఒక్కదగ్గర ఉంటే
కేసీఆర్ కు ఎందుకు భయమని ప్రశ్నించారు.
SLBC ప్రాజెక్ట్ పేరు చెప్పగానే కేసీఆర్ ఎందుకు
భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఆయన నిర్లక్ష్యం ,అసమర్థత కారణంగానే రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తికావడంలేదన్న
ఉత్తమ్ కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును
కమీషన్ల కోసమే పూర్తి చేశారన్నారు.