Advertisement

  • నవంబర్ 3న ఓట్లు... ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు...!

నవంబర్ 3న ఓట్లు... ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు...!

By: Anji Wed, 21 Oct 2020 11:59 AM

నవంబర్ 3న ఓట్లు... ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు...!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు పోలింగ్ జోరుగా సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వగా.. తాజాగా ఈ జాబితాలోకి ఫ్లోరిడా చేరింది. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ముందుగానే ఓట్లు వేసేందుకు ఫ్లోరిడా వాసులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

కొన్ని కౌంటీల్లో ఓటు వేసేందుకు 15 నిమిషాల సమయం పడుతుండగా.. మరికొన్నిటిలో ఓటర్లు దాదాపు గంటన్నార పాటు లైన్లల్లో వేచి ఉంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. పామ్ బీచ్ కౌంటీ ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.

ఈదురు గాలులు కూడా బలంగా వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ ప్రజలు ఓటు వేసేందుకు ముందుకొచ్చారు. మూడు గంటల పాటు లైన్లల్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఫ్లోరిడా రాష్ట్రం ఇరువురికి కీలకమే.

అయితే గతేడాది తన అధికార నివాసాన్ని పామ్ బీచ్ ఎస్టేట్కు మార్చారు ట్రంప్. అదే సమయంలో రాష్ట్రంలో పైచేయి సాధించడం ట్రంప్నకు ఎంతో అవసరం. లేకపోతే జో బైడెన్ను ఓడించి మరోమారు వైట్ హౌస్ అడుగుపెట్టే అవకాశం ట్రంప్నకు దాదాపు అసాధ్యమే.

Tags :

Advertisement