Advertisement

  • అమెరికాలో ప్రారంభమైన కరోనా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ..నిధులను రెట్టింపు చేసిన ట్రంప్ ప్రభుత్వం

అమెరికాలో ప్రారంభమైన కరోనా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ..నిధులను రెట్టింపు చేసిన ట్రంప్ ప్రభుత్వం

By: Sankar Mon, 27 July 2020 2:07 PM

అమెరికాలో ప్రారంభమైన కరోనా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ..నిధులను రెట్టింపు చేసిన ట్రంప్ ప్రభుత్వం



ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది..అయితే కరోనా మహమ్మారిని నిర్ములించేందుకు వాక్సిన్ ప్రయోగాలు కూడా వేగంగా సాగుతున్నాయి ..వచ్చే ఏడాది ఆరంభంలోనే కోట్లాది అమెరికన్లకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు అగ్రరాజ్యం భారీ కసరత్తు చేపట్టింది. మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు భారీగా నిధులు సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది.

మానవులపై వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవడంతో 7500 కోట్ల రూపాయల వరకూ ఈ వ్యాక్సిన్‌పై అమెరికా ప్రభుత్వం వెచ్చించనుందని మోడెర్నా బయాటెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. దీంతో రెండు విడతలుగా ఈ వ్యాక్సిన్‌కు అమెరికా 7500 కోట్ల రూపాయలు సమకూర్చినట్లయింది.

గతంలో 483 మిలియన్‌ డాలర్ల నిధులను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఆ నిధులను రెట్టింపు చేయడంతో మొత్తం పెట్టుబడులు రూ 7500 కోట్లకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ మూడవ దశ పరీక్షలను ప్రభుత్వంతో కలిసి 30,000 మంది వాలంటీర్లపై నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో అదనపు నిధులు ఉపకరిస్తాయని మోడెర్నా తెలిపింది.

ఇక సోమవారం నుంచి ప్రారంభమైన తుది దశ పరీక్షలో పాల్గొనే 30,000 మందిలో 15,000 మందికి వ్యాక్సిన్‌ 100 మెక్రోగ్రామ్‌ డోస్‌ ఇవ్వనుండగా, మిగిలిన వారికి ప్లాసెబో ఇస్తారు. కోవిడ్‌-19తో అమెరికా తీవ్రంగా ప్రభావితమవడంతో వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Tags :
|
|
|

Advertisement