Advertisement

  • కరోనా సోకినా అయిదు రోజులకే బయటకు వచ్చిన ఎమ్యెల్యే ... అంటువ్యాధి నివారణ చట్టం కింద కేసు ఫైల్

కరోనా సోకినా అయిదు రోజులకే బయటకు వచ్చిన ఎమ్యెల్యే ... అంటువ్యాధి నివారణ చట్టం కింద కేసు ఫైల్

By: Sankar Wed, 07 Oct 2020 4:35 PM

కరోనా సోకినా అయిదు రోజులకే బయటకు వచ్చిన ఎమ్యెల్యే ... అంటువ్యాధి నివారణ చట్టం కింద కేసు ఫైల్


కరోనా వైరస్ సోకితే కనీసం 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. హోమ్ లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. క్వారంటైన్ ముగిసే వరకు బయటకు రాకూడదు.సామాన్యులు ఈ రూల్స్ ను ఖచ్చితంగా పాటిస్తున్నారు.

రాజకీయ నాయకులు మాత్రం ఈ రూల్స్ ను బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు. సెప్టెంబర్ 29 వ తేదీన ఢిల్లీలోని కొండ్లి నియోజక వర్గ ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. అది జరిగిన ఐదు రోజులకు అంటే అక్టోబర్ 2 వ తేదీన కుల్దీప్ కుమార్ యూపీలోని హత్రాస్ వెళ్ళాడు.

హత్రాస్ లో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినట్టు కుల్దీప్ కుమార్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కరోనా సోకినా ఐదు రోజులకే ఎమ్మెల్యే బయటకు రావడంతో ఆయనపై యూపీ పోలీసులు అంటువ్యాధి నివారణ చట్టం కింద కేసును ఫైల్ చేశారు.

Tags :
|

Advertisement