Advertisement

  • బెదిరింపుల నేపథ్యంలో ఎంపీ రవికిషన్ కు వై ప్లస్ క్యాటగిరి భద్రత

బెదిరింపుల నేపథ్యంలో ఎంపీ రవికిషన్ కు వై ప్లస్ క్యాటగిరి భద్రత

By: Sankar Thu, 01 Oct 2020 7:44 PM

బెదిరింపుల నేపథ్యంలో ఎంపీ రవికిషన్ కు వై ప్లస్ క్యాటగిరి భద్రత


బాలీవుడ్ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరుగుతుంది. సుశాంత్ మరణమే తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నలుగురు హీరోయిన్స్ ను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. 'రేసుగుర్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు బీజీపీ ఎంపీ రవి కిషన్ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో డ్రగ్స్ అంశాన్ని లేవనెత్తారు.

దేశంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందని.. యువతను తప్పుడు మార్గంలో నడిపించే కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు బాలీవుడ్‌ను కించపర్చినట్టు ఉన్నాయంటూ ఎంపీ జయాబచ్చన్ అభ్యంతరం చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో రవికిషన్ కు ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. దీంతో డ్రగ్స్ రాకెట్ నుంచి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయని.. భద్రత పెంచాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసాడు.

రవి కిషన్ కు యూపీ ప్రభుత్వం భారీ భద్రతను కల్పించింది. ఆయనకు Y+ క్యాటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తనకు Y+ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు పేర్కొన్న యూపీ ప్రభుత్వానికి.. సీఎం యోగిత్యానాథ్ కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు రవి కిషన్.

Tags :
|

Advertisement